అన్నిటికీ ఆయనేనా…? ఏ సమస్య వచ్చినా… నేరుగా ముఖ్యమంత్రే స్పందించాలా? మిగిలిన వాళ్ళకు బాధ్యత లేదా? చేసింది చెప్పుకోవాలన్నా, ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలన్నా డైరెక్ట్గా సీఎం ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది? కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తున్నారు? అటు అధికార పార్టీ…ఇటు కేబినెట్ పరస్పర సమన్వయంతో కలిసి అడుగు ముందుకు వేసినప్పుడే ఎక్కడైనా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సక్రమంగా నడుస్తుంది. అఫీషియల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకున్నా…అధికార పార్టీ నేతలకు ఆ ప్రయారిటీ ఉండటం సాధారణం. ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే పార్టీ, విపక్షాలు డైరెక్ట్గా సీఎంని అటాక్ చేస్తే కేబినెట్ సహచరులు వెంటనే రియాక్ట్ అయి కౌంటర్స్ ఇవ్వడం కూడా సర్వసాధారణం. కానీ… ప్రస్తుతం తెలంగాణలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు పొలిటికల్ అబ్జర్వేషన్. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటీ ముట్టనట్టు ఉంటున్నారనే అభిప్రాయం బలపడుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా… పార్టీ నేతల్లో ఇంకా ఆ జోష్… ఆ వ్యూహం కనిపించడమే లేదని అంటున్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరిగింది… మరో రీజన్ అయినా…. నేరుగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డే స్పందించాల్సి వస్తోంది తప్ప… ఇటు పార్టీ నుంచిగాని, అటు కేబినెట్లో మంత్రుల నుంచిగానీ… ఆశించిన స్థాయిలో రియాక్షన్లో లేదని మాట్లాడుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు వ్యవహాన్నే తీసుకుంటే…ఈసారి గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది.
దాంతో. గన్నీ బ్యాగుల కొరత, రవాణాకు లారీలు చాలకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రులు యాక్టివ్ రోల్ తీసుకుని, ఉన్న సమస్యను చెప్పి…రైతుల్ని మెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ… ఇంకా ఎవరూ పెద్దగా కనిపిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలులో వేగం కూడా పెరిగింది. కానీ దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువ రావడంతో సమస్యగా అనిపిస్తోంది. సాధారణంగా సమస్యలు ఏటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ… వాటిని అధిగమించేందుకు ఉత్పత్తి చేసే ఏర్పాట్లలో ప్లానింగ్ లోపమే అసలు సమస్య. దాన్ని సరిదిద్దేందుకు కొంత మేర ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. కనీసం ఆ చేసింది చెప్పుకోవడంలో కూడా అధికార పార్టీగా కాంగ్రెస్ నేతలు, కేబినెట్ మంత్రులు విఫలమవుతున్నారని, కొందరైతే అసలు మాకు సంబంధం లేదన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తే… ప్రెస్ నోట్లు… లేదంటే అర కొర రివ్యూలే అన్నట్టు ఉంది పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్లు కూడా మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నట్లు అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎపిసోడ్పై కానీ.. ధాన్యం కొనుగోలు విషయంలోగానీ… మాట్లాడలేదు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖనే చూసుకుంటారని అనుకుంటున్నారా..? లేదంటే… మొత్తానికి ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తారని… అత్యంత కీలకమైన అంశాల్లో కూడా సీనియర్స్ నుంచి రియాక్షన్ ఉండటం లేదు. ప్రతి అంశంలోనూ.. సీఎం రేవంత్ రెడ్డే స్పందించాల్సి వస్తోందని ఓపెన్ టాక్.
అయితే… పార్టీ సీనియర్లు, మంత్రులు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేసే మాటల దాడి ప్రభావం అందరి మీద పడుతుందని, లాభ నష్టాలకు అంతా ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సంగతి మర్చిపోతున్నట్టు ఉన్నారన్న టాక్ నడుస్తోంది. అసలు వీళ్లకి దిశానిర్దేశం కరవైందా అన్నది ఇంకొందరి ప్రశ్న. పార్టీ నుండి వచ్చే రియాక్షన్స్ కూడా మొక్కుబడిగా ఉంటున్నాయి తప్ప…విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేదు, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న కసి మాత్రం ఏ కోశానా కనిపించడం లేదని మాట్లాడుతున్నారు. మరోవైపు మంత్రులు అసలు గాంధీభవన్ వైపు రావడమే మానేశారు. ఇప్పటిదాకా పార్టీఆఫీస్ మెట్లెక్కని ఎంపీలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అధికారంలో ఉండి, ఉమ్మడిగా ముందుకు కదలాల్సిన పార్టీ…ఎందుకు డల్గా మారిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అంతా ఆయనే చూసుకుంటారంటూ భారం మొత్తం సీఎం రేవంత్ మీదే వేసేస్తే…. ఆయన ఎంతవరకని మోస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు అందరూ ఆ పవర్ని అనుభవిస్తున్నట్టే…. రేపు ఒకవేళ తేడా కొడితే… నేడు నోళ్ళకు తాళాలు వేసుకున్నవాళ్ళు కూడా విపక్షంలోకే వెళ్లిపోతారు తప్ప…వాళ్లకే ప్రత్యేకంగా పవర్స్ రావు కదా..? కలిసి పని చేసుకుంటే ఉన్న పవన్నే నిలబెట్టుకోగలుగుతాం కదా అన్నది కాంగ్రెస్లోని ఓ వర్గం లాజిక్. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న పరిస్థితి మారితేనే అందరికీ భవిష్యత్ ఉంటుంది తప్ప…కొందరికే ప్రత్యేకం కాదని అంటున్నారు. కేబినెట్ మంత్రుల్లో ఇప్పుడున్న వైఖరి అందరికీ నష్టం చేస్తే తప్ప….మేం తప్పించుకుంటామంటే ముందు ముందు తిప్పవన్నది.
కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో ఉన్న అభిప్రాయం

