రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలం: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి సంచలనం సృష్టించింది. కేవలం ఐటీ కారిడార్కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతున్న భాగ్యనగరం తన రికార్డులను తానే తిరగరాస్తోంది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన ఈ-వేలంలో భూముల ధరలు కళ్ళు చెదిరే రీతిలో పలికాయి. సర్వే నంబర్ 83/1లోని పాన్ మక్తా ప్రాంతంలో 6 ఎకరాల 29 గుంటల భూమికి నిర్వహించిన వేలంలో, ఒక ఏకంగా రూ.237 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం రూ.177 కోట్లు పలకగా, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఆ ధరను మించిపోయి రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, రాయదుర్గ్లోని సత్వ ఇమేజ్ టవర్స్ సమీపంలోని ఈ 6 ఎకరాల 29 గుంటల ప్లాట్ నేటి TGIIC వేలంలో ఎకరానికి ₹237 కోట్లకు విక్రయించబడింది. మూలం: https://t.co/O71xXIMqdT
కొన్ని వారాల క్రితం, ఈసారి ఎకరాకు ₹200 కోట్లు వస్తాయని అంచనా వేస్తూ పోస్ట్ చేసాను. https://t.co/zg99RimYMV pic.twitter.com/tF7cvLRDFo
— హైదరాబాద్ఇన్సైడర్ (@HydSpeaks) మే 28, 2026
రికార్డులు బద్దలు.. అంతర్జాతీయ స్థాయిలో చర్చ
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో ఉన్న ఈ భూమి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. IT కంపెనీలు, హై-రైజ్ టవర్లు, మెట్రో కనెక్టివిటీ ఉండటంతో దేశీయ , అంతర్జాతీయ వలపర్లు ఈ వేలంలో పోటాపోటీగా ఉన్నాయి. టీజీఐఐసీ నిర్ణయించిన కనీస ధర రూ.139 కోట్లు కాగా, వేలం ముగిసే సమయానికి దాదాపు రూ.237 కోట్లకు చేరుకుంది. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలతో పోల్చినా, హైదరాబాద్లోని ఈ ధర ఇప్పుడు భారతీయ రియల్టేట్ రంగంలో టాప్ రేంజ్లో ఉంది.
రాయదుర్గం ఈ-వేలం ఆ ప్రాంతానికి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎకరం దాదాపు రూ.237 కోట్లకు భూమిని విక్రయించారు. ఎకరా ప్రారంభ ధర రూ.139 కోట్లతో పోలిస్తే ఇది 70.5% ఎక్కువ. pic.twitter.com/0cHXcZWIee
— దుర్గ (@Durga_sunku) మే 28, 2026
ఎందుకింత క్రేజ్?
రాయదుర్గం ఏర్పాటు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక్కడి భూమి బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా ఇన్వెస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేలం వేసిన 6 ఎకరాల స్థలం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. గతంలో కోకాపేట నియోపోలీస్ లో ఏకరం రూ.100 కోట్లు దాటినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఇప్పుడు రాయదుర్గం ఆ రికార్డును ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఈ ఒక్క వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతోందంటూ చర్చిస్తున్నారు. ఈ రికార్డు ధర హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరోస్థాయికి తీసుకెళ్లడంలో సందేహం లేదు.
ఇంకా చదవండి

