రిషబ్ శెట్టి బాలీవుడ్ : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి…హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇక నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకున్న ఆయన డైరెక్టర్ గా పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు కాంతార, కాంతార చాప్టర్ వన్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే బాలీవుడ్ హీరోలు కొంతమంది రిషబ్ శెట్టి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ లాంటి నటుడు రిషబ్ శెట్టి డైరెక్షన్లో నటించాలని చెప్పారు. ఇక మొత్తానికైతే రిషబ్ శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతోనే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అక్షయ్ కుమార్ తన సినిమాలో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పాన్ ఇండియాలో సౌత్ సినిమా ఇండస్ట్రీ సత్తా చాటుకోవడం అలాగే మన దర్శకులు సైతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను సాధించడం బాలీవుడ్ కి నిద్ర పట్టడం లేదు.
అందుకే మన హీరోలతో సినిమాలను చేయడం మన దర్శకులతో మూవీస్ ని తెరకెక్కించి సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్నాడు…ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే పట్టించుకోని బాలీవుడ్ సౌత్ సినిమా దర్శకులతోనే ఇప్పుడు సినిమాలు చేయడం…అక్కడ హీరోలందరు కూడా డీలా పడిపోయారు.
అక్కడి దర్శకులైతే ఒక్క సక్సెస్ ని కూడా సాధించడం లేదు. మన దర్శకులకు, హీరోలకు, మన సినిమాలకు డిమాండ్ పెరిగింది… మొత్తానికైతే సౌత్ సినిమా ఇండస్ట్రీ గొప్పతనం ఏంటో ఇప్పుడు బాలీవుడ్ వాళ్లకు తెలిసి వచ్చింది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వారి అభిప్రాయాలను చెబుతున్నారు…

