నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతోంది. సుదీర్ఘకాలంగా పెండిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాల పెంపుదల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మమాట-అంగన్వాడీ బాట విద్యా నూతనసంవత్సరం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు.
పోస్ట్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్న్యూస్.. మొదట కనిపించింది నవతెలంగాణ.

