అన్నామలై: తమిళనాడు రాజకీయాలు షేక్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా విజయ్ చుట్టూ తిరిగిన అక్కడి పాలిటిక్స్ ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. అన్నామలై నామస్మరణ చేస్తున్నారు. బిజెపి అతడిని సరిగా వాడుకోలేదు గాని.. అతడు బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన స్టామినా ఏమిటో నిరూపించుకుంటున్నాడు. దీంతో అధికార టీవీకే నేతలు.. మొన్నటిదాకా అన్నమలైతో స్నేహం చేసిన బిజెపి నేతలు సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు.
బిజెపి నుంచి అన్నామలై బయటకు వచ్చారు. ఆయన రాజీనామా చేసిన కేవలం 24 గంటల్లోనే 14 లక్షల మందికి పైగా ప్రజలు చేతులు కలిపారు. ఆయన చేపట్టబోయే వుయ్ ది లీడర్స్ ఉద్యమంలో చేతులు కలుపుతామని ప్రతిజ్ఞ చేశారు.
అన్నామలై ఆన్లైన్ లింక్ we the leaders ను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో.. అది కాస్త సంచలనంగా మారింది. ఈ కథనం రాసే సమయం వరకు అందులో 14 లక్షలకు పైగా ప్రజలు చేరారు. ఇప్పటికీ నమోదులు కొనసాగుతున్నాయి. 2020లో ఇదే పేరుతో ఆయన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడితోనే అన్నామలై ఆగిపోవడం లేదు. తమిళనాడుకు పారిశ్రామిక రాజధానిగా పేరుపొందిన కోయంబత్తూరులో ఆయన మాజీ రాష్ట్రపతి కలం పేరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో నైతిక రాజకీయాలను పెంపొందించే దిశగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. అంతేకాదు ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఉంది.
అన్నామలై ఐపీసీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆయన బలంగా సంకల్పించారు. కానీ బిజెపి అధిష్టానం ఆయన సేవను సరిగా వాడుకోలేకపోయింది.. అన్నాడీఎంకేతో జతకలిసి అన్నమలైని దూరం పెట్టింది. దానిని తట్టుకోలేక ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.. సామాన్యులకు తన పార్టీలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు.
ప్రజల నాయకుల వద్దకు కాకుండా.. ప్రజల వద్దకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు.. వంశపారంపర్య రాజకీయాలకు తమిళనాడును దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రకారం చూసుకుంటే తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

