హైదరాబాద్: జనగామ జిల్లా లింగాలఘన్ పూర్ మండలం నవాబ్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హనుమకొండకు చెందిన ఇమ్రాన్, సుభాన్ గా పోలీసులు గుర్తించారు.

