– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాతో కుదిరిన చారిత్రక 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి గుండా రవాణా అన్ని రకాల అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రాబోయే 60 రోజుల పాటు రవాణా రుసుములను (ట్రాన్సిట్ ఫీజు) పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ కాలంలో నౌకల ప్రయాణానికి అయ్యే అనుబంధ ఖర్చులను ఇరాన్ ప్రభుత్వమే భరించనుంది. అయితే భద్రతా కారణాలు, కార్యాచరణ నిబంధనలు దృష్ట్యా ప్రతి నౌక పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, అలాగే కేటాయించిన ప్రత్యేక మార్గాల్లోనే సరఫరా చేయాలని స్పష్టం చేసింది.
ఈ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా అమెరికా రక్షణ విభాగం కూడా కీలక అడుగు వేసింది. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధన అమలును అమెరికా సైన్యం అధికారికంగా నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాతీయ నౌకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు సాగించడానికి మార్గం సుగమమైంది. ఈ దిగ్బంధనం తొలగడంతో హర్మూజ్ జలసంధి ద్వారా లక్షలాది బ్యారెళ్ల ముడి చమురు రవాణా మళ్లీ పుంజుకుంది. ఫలితంగా ప్రపంచ ఇంధన చమురు ధరలు వేగంగా తగ్గుతున్నాయి, ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చే పరిణామం. యుద్ధ వాతావరణం వల్ల నష్టపోయిన వాణిజ్య రంగాన్ని మళ్లీ ఉత్సాహపరిచేందుకు ఇరాన్ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది.
– ప్రకటన –

