భారత్పై ఇరాన్ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత్పై ఇరాన్ ప్రశంసల జల్లు కురుపించింది. తమ మాజీ అలీ హుస్సేనీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు సమర్పించారు. దుఃఖ సమయంలో ఉన్న ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి…తమ సానుభూతిని ప్రకటించిన భారత్ను మరిచిపోలేమని. ఈ చర్య ఇరుదేశాల మధ్య స్నేహానికీ, అనుబంధానికీ ప్రతీకగా నిలుస్తుందని కొనియాడింది. రెండు దేశాల చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ చిరకాల బంధాన్ని, స్నేహాన్నీ ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని. ఇరాన్ దివంగత సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని తెహ్రాన్లోని గ్రాండ్ మొసళ్ల మసీదులో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. భారత్ తరపున బీహార్ గవర్నర్, సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఇరాన్కు వెళ్లి నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు భారత్కు చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అంత్యక్రియలకు ప్రముఖులు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషహద్లో 9న ఖననం చేయనున్నారు.

