తెలంగాణ:టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ( Kalvakuntla kavitha )ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నోటీసులకు ఇప్పటివరకు స్పందించిన కవిత.
నేరుగా ఈరోజు (మంగళవారం) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లో కవిత తన అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ( High Court to EC )సూచించింది.
విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో ఉన్న రాజకీయ పార్టీలు నమోదై ఉన్నందున అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
అంతేకాకుండా టీఆర్ఎస్ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయి,గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు.టీఆర్ఎస్( TRS ) పేరును కేటాయించడం సాధ్యం కాదని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాత్రం టీఆర్ఎస్ పేరును ఆమెకు కేటాయించాలని కోర్టులో వాదనలు వినిపించారు.ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవితకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే ప్రతికూల నిర్ణయం తీసుకునే సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లో కవిత అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవడానికి ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది.


