BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాలను వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, OTT సదుపాయంతో ఈ ప్లాన్ను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్నెట్ (BharatNet) ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం.
700GB హైస్పీడ్ డేటా:
ఈ ప్లాన్లో వినియోగానికి 25 Mbps వరకు బ్రాడ్బ్యాండ్ స్పీడ్ లభిస్తుంది. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు ఇది సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ ప్రదర్శించారు. వినియోగదారులు 700GB వరకు పూర్తి వేగంతో డేటాను ఉపయోగించవచ్చు. ఆ పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ కొనసాగుతుంది. అయితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. వాటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
అపరిమిత కాల్స్:
ఈ ప్లాన్లో దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తారు. అదనంగా కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత ఇన్స్టాలేషన్తో పాటు మోడెమ్ కూడా ఉచితంగా అందజేస్తుంది BSNL. దీనితో ప్రారంభంలో ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలు ఉండవు.
ఉచితంగా OTT:
బ్రాడ్బ్యాండ్ ప్లాన్తో పాటు Waves OTT ప్లాట్ఫామ్కు కూడా ఉచితంగా లభిస్తుంది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోద కార్యక్రమాలను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్ రెండూ పొందవచ్చు.
ఇదిలా, ఇటీవల BSNL శాటిలైట్ ఫోన్ ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించింది. మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలు, అడవులు, సముద్ర ప్రయాణాలు, గనులు, ట్రెక్కింగ్ ప్రాంతాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫోన్ ఉపయోగపడేలా రూపొందించబడింది. దీనితో విపత్కర పరిస్థితుల్లో కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది.

