- అమల్లోకి భారత్-యూకే ఒప్పందం
- వేలాది వస్తువులపై తగ్గనున్న సుంకాలు
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటిగా ఉంది. ఈ ఒప్పందంతో భారతీయ ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో ఎక్కువ ప్రాధాన్యత లభించనుండగా… రెండు దేశాల మధ్య వేలాది వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గుతున్నాయి.
ఈ ఒప్పందంతో పాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కూడా అమల్లోకి వచ్చింది. దీని ద్వారా తాత్కాలికంగా యూకేలో పనిచేసే వేలాది మంది భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల్లో భారీ ఊరట లభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన అత్యంత ప్రతిష్ఠాత్మక, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ”గోల్డ్ స్టాండర్డ్” వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు.
యూకేకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తుల్లో 99 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించబడతాయి లేదా తగ్గుతాయి. భారత్లోకి దిగుమతి అయ్యే 90 శాతం బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గుతున్నాయి. ఈ ఒప్పందం కేవలం సుంకాలకే పరిమితం కాకుండా మొత్తం 30 అధ్యాయాలతో రూపొందించబడింది. ఇందులో డిజిటల్ ట్రేడ్, ఫైనాన్షియల్ సర్వీస్లు, టెలికమ్యూనికేషన్స్, మేధో సంపత్తి హక్కులు, ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ కొనుగోళ్లు
పారదర్శకత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక యూకే దిగుమతి సుంకాలు తగ్గడంతో భారత్కు చెందిన అనేక ఎగుమతి రంగాలకు భారీ ఊరట లభించనుంది.
లాభపడనున్న రంగాలు:
వస్త్ర, దుస్తుల పరిశ్రమ
లెదర్ ఉత్పత్తులు
రత్నాలు, ఆభరణాలు
ఇంజినీరింగ్ ఉత్పత్తులు
ఆటో విడిభాగాలు
ప్రజలు
క్రీడా సామగ్రి
రసాయనాలు
యంత్రాలు
ప్రాసెస్డ్ ఫుడ్
సముద్ర ఆహార ఉత్పత్తులు
టీ
సుగంధ ద్రవ్యాలు
టెక్స్టైల్ రంగానికి భారీ ఊరట
ఈ ఒప్పందంతో వస్త్ర పరిశ్రమకు అత్యధిక ప్రయోజనం లభించనుంది. భారత దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్పై ఉన్న 8 నుంచి 12 శాతం వరకు దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయి. దీనితో పాకిస్తాన్, బలాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత్ పోటీ చేయగల సామర్థ్యం పెరుగుతుంది.
వెల్స్పన్ లివింగ్ సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం యూకే హోమ్ టెక్స్టైల్ దిగుమతుల్లో పాకిస్థాన్ వాటా 55 శాతం ఉండగా, భారత్ వాటా కేవలం 6-7 శాతమేనని, ఇప్పుడు ఆ అంతరాన్ని తగ్గించే అవకాశం వచ్చిందని తెలిపారు. పరిశ్రమ అంచనాల ప్రకారం వచ్చే మూడు సంవత్సరాల్లో భారత్ నుంచి యూకేకు టెక్స్టైల్ ఎగుమతులు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. యూకే ప్రభుత్వం పలు భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాలను తొలగించింది. వాటిలో బాస్మతి బియ్యం, టీ, సుగంధ ద్రవ్యాలు, రొయ్యలు, ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నాయి. దీనితో కేరళ, అసోం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఎగుమతిదారులకు పెద్దఎత్తున లాభం చేకూరనుంది. రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు రంగాలకు కూడా ఊతం లభించనుంది.
ఈ ఒప్పందంతో అగ్రో కెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు యూకే మార్కెట్లో సుంక రహిత ప్రవేశం పొందుతున్నాయి. 2030 నాటికి భారత రసాయన పదార్థాలు ఎగుమతుల రెట్టింపు అవ అంచనా. అలాగే కోటా విధానంలో భారత్కు చెందిన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ సంస్థలకు కూడా ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు రంగానికి కూడా ఇది కీలక ఒప్పందంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు 350 మిలియన్ డాలర్ల విలువైన ఉక్కు ఎగుమతి కోటా లభించింది. ఇది గత సగటు ఎగుమతుల కంటే చాలా ఎక్కువ. 2027 నాటికి ఉక్కు ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు పరిశ్రమలు ఉన్నాయి.
FTAతో పాటు అమల్లోకి వచ్చిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) వల్ల యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ నిపుణులు ఐదేళ్ల వరకు అక్కడి నేషనల్ ఇన్సూరెన్స్ పథకానికి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారు భారత్ యొక్క సోషల్ సెక్యూరిటీ వ్యవస్థకే చెల్లింపులను కొనసాగించవచ్చు.
వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, ఎగుమతులకు మార్కెట్లు కల్పించడం, ఉద్యోగులు, పరిశ్రమలకు వ్యాపారాలను తగ్గించడం ద్వారా భారత్-యూకే ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

