ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ 96 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త సాంప్రదాయానికి తెరలేవనుంది. ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరగబోయే 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టుకు ఈసారి సరికొత్తగా ‘ఛాంపియన్షిప్ రింగ్స్’ బహుకరిస్తుంది. ఫుట్బాల్ చరిత్రలోనే ఈ తరహా బహుమతిని అందించడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడా రంగంలో విజేతలకు ఉంగరాలను బహుకరించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అదే వినూత్న శైలిని అంతర్జాతీయ ఫుట్బాల్లోకి తీసుకువస్తూ, ఇదొక చరిత్రాత్మక ఘట్టమని ఫిఫా (FIFA) అభివర్ణించింది.
ఫైనల్ మ్యాచ్లో గెలిచే జట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన 30 ఛాంపియన్షిప్ రింగ్స్ను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానుల కోసం మరో 1,996 ఉంగరాలను విక్రయానికి ఉంచిన సంస్థ ప్రకటించింది. విజేతలకు అందించే ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్స్, ప్రపంచకప్ ట్రోఫీతో పాటు ఈ విజయ సూచిక ఉంగరం కూడా గెలిచిన జట్టుకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలవనుంది.
అయితే.. ఫిఫా తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రపంచ ఫుట్బాల్ సర్కిల్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాగర్ ఆటను పూర్తిగా అమెరికా చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆట మధ్యలో హైడ్రేషన్ బ్రేకులు ప్రవేశపెట్టడం వల్ల సాంప్రదాయబద్ధంగా సాగే రెండు అర్ధభాగాలు కాస్తా, నాలుగు క్వార్టర్ల మ్యాచ్గా మారిపోయిందనే అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్లో ప్రత్యేకంగా హాఫ్టైమ్ షోను కూడా ఏర్పాటు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా.. అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఈ 2026 టోర్నమెంట్ ముగింపు వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకా వైట్ హౌస్ ధృవీకరించింది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం విజేతలకు ట్రంప్ చేతుల మీదుగా ప్రపంచకప్ ట్రోఫీని అందజేస్తారని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది.

