వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు హాజరయ్యారు. చాపురం పంచాయతీలోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం ఆక్రమించారు. ఆ తర్వాత రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఆ ప్లాట్లను తన కొడుకు పేరు మీద నియమించారు. ఇంతటితోనే ఆగిపోలేదు భూమిని కుమారుడి పేరు మీద చేయించడానికి శ్రీకాకుళం మున్సిపాలిటీలో కనక లింగేశ్వర రావు చనిపోయినట్టు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించారు. మొత్తంగా 922 చదరపు గజాల తన కొడుకు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సీతారాం భూకబ్జా కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రజిని, ఆమె అల్లుడు సలిపల్లి లక్ష్మణరావు.. సతీష్ కుమార్.. త్రినాధ్.. తమ్మినేని సీతారాం.. ఆయన భార్య వాణి ఉన్నారు. వీరు సహకరించడం వల్లే కూన పెద్దిరాజు అనే డాక్యుమెంట్ రైటర్ నకిలీ పత్రాలు సృష్టించారు. తమ్మినేని సీతారాం కు చెందిన డిగ్రీ కాలేజీలో పనిచేసే సిబ్బందితో దారుణమైన పనులు చేశారు. చేరే సమయంలో వారితో సాక్షుల సంతకాలు పెట్టారు. భూమికోసం తమ్మినేని ఇంతటి కుట్రలకు పాల్పడ్డారు. భూమి కోట్లలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇక ఈ కేసులో నకిలీ పత్రాలు ముఠాతో తమ్మినేని కుటుంబానికి సంబంధాలు కొనసాగుతున్నాయి.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రినాధ్ మాజీ హోంగార్డు. ఇతడి మీద మూడు కేసులు ఉన్నాయి. సతీష్ కుమార్ కూడా కేసులు ఎదుర్కొన్నాడు. లక్ష్మణరావు.. రజిని.. మిగిలినవారు ఒక ముఠాగా ఏర్పడ్డారు. భూములను కబ్జా చేస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు భూ కోసమే బొబ్బిలి వచ్చింది. తన అల్లుడి చిరునామా ద్వారా మరో ఆధార్ తీసుకుంది. నకిలీ పత్రాలతో అందించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈ వ్యవహారంలో ఆమెకు భారీగానే నగదు ముట్టినట్లు తెలుస్తోంది. ఈకేసును నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం పోలీసులకు చిక్కింది.

