సినిమా ఇండస్ట్రీలో తమ సేవలను అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం వాళ్లకి జాతీయ పురస్కారాలను అందించి వారిని గౌరవిస్తుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా 72వ జాతీయ పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగానే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ కి ఎందుకని అవార్డు రాలేదు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. నిజానికి కేంద్రం దక్షిణాది సినిమాల మీద విపక్షతను చూపిస్తూ మన యాక్టర్స్ కి అవార్డ్స్ రాకుండా చేస్తుందంటూ కొన్ని వార్తలైతే వచ్చేవి. అప్పుడు నిజంగానే కేంద్రం అలా చేసిందా లేదంటే కావాలంటే కొంతమంది అలా క్రియేట్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమాలకి కూడా ఎక్కువ సంఖ్యలో అవార్డులైతే దక్కుతున్నాయి. ముఖ్యంగా ‘బ్రహ్మయుగం’ సినిమాలో నటించినందుకు గాను మమ్ముట్టి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక మమ్ముట్టి కూడా దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రస్తుతం ఆయన మీద అలాంటి ఆరోపణ రావడం లేదు. కానీ అల్లు అర్జున్ కి ఎందుకు అవార్డు రాలేదు అనే ధోరణిలోనే చాలామంది ఆలోచిస్తున్నారు. నిజానికి పుష్ప మొదటి పార్ట్ కు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇకప్పటికి ఇలాంటిదే సినిమాలో తన నటనన్న అతనికంటే ఇంకా అద్భుతంగా నటించి ప్రేక్షకుడిని మైమరపింపజేసిన నటులు కొంతమంది ఉన్నారు. అందులో మమ్ముట్టికి ఆ అవకాశం అయితే దక్కింది. 1998 తర్వాత మమ్ముట్టికి ఇప్పుడే జాతీయ అవార్డు వచ్చింది. 28 సంవత్సరాల తర్వాత ఆయన మరోసారి జాతీయ అవార్డును అందుకున్నారు.
మొట్టమొదటి భారతదేశపు పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీ కాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘చందు చాంపియన్’ సినిమాలో కార్తీక్ ఆర్యన్ పరకాయ ప్రవేశం చేసి నటించాడు. అందుకుగాను అతనికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డును ప్రధానం చేశారు. ఇద్దరికీ సమపాలలో నేషనల్ అవార్డు రావడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ‘ఆడు జీవితం’ సినిమాకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా డెప్ట్ యాక్టింగ్ అయితే చూపించాడు. అయినప్పటికి అతనికి కూడా అవార్డు వరించకపోవడం కొంతవరకు బాధను కలిగించే విషయమే… అయిన కూడా అతనికి అవార్డు వరించలేదు.
ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టికి జాతీయ అవార్డు రావడం ఇది నాలుగోసారి కావడం విశేషం… అమితాబచ్చన్తోపాటు మమ్ముట్టి నాలుగు సార్లు అవార్డును అందుకున్న నటుడిగా చరిత్రలో నిలిచిపోయింది. కమల్ హాసన్, అజయ్ దేవగన్ లు 3 సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు…మోహన్ లాల్, ధనుష్ లు 2 సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు… అల్లు అర్జున్ ఒక్కసారి ఈ అబ్రాడ్ ను అందుకోవడం విశేషం…

