నవతెలంగాణ – హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర, రాఘవాఫురం గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆపి ఉన్న బోరు బండిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు నర్సింగాపురం తండాకు చెందిన బాదావత్ తిరుపతి (35), కేతావత్ నరేందర్ (25)గా పేర్కొన్నారు. పని ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు.
పోస్ట్ బోరు బండిని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి మొదట కనిపించింది నవతెలంగాణ.

