భారత్-ఒమన్ వాణిజ్య ఒప్పందం: అమెరికా–ఇరాన్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భారత్ ఇంధన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు భారీగా పెరిగి, సరఫరా కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.
హార్ముజ్కు ప్రత్యామ్నాయం…
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని అత్యధిక చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల నౌకల రవాణాలో అంతరాయం ఏర్పడటంతో భారత్కు ఇంధన సరఫరా దెబ్బతింది. దీని ప్రభావంతో పెట్రోల్, ఎల్పీజీ ధరలు పెరిగాయి. సరఫరా కొరత ఏర్పడింది. పానిక్ బయింగ్ పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్కు ప్రత్యామ్నాయ మార్గం అవసరం.
ఒమన్తో కీలక ఒప్పందం..
భారత్–ఒమన్ మధ్య కుదిరిన కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (సీపీఏ) 2025, జూన్ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా ఒమన్లోని ప్రధాన పోర్టులు (సలాలా, దుక్మ్ రాష్ట్రంలోని) భారత్కు చమురు, ఎన్జీ, ఇతర ఇంధన ఉత్పత్తులు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా అవుతాయి. ఒమన్ తీర ప్రాంతం హార్ముజ్ జలసంధికి వెలుపల ఉండటం ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా మార్చింది. ఇది భారత్కు సురక్షితమైన, నమ్మదగిన ఇంధన సరఫరా మార్గాన్ని అందిస్తోంది.
భారత్కు చాలా కీలకం..
ఒమన్తో ఒప్పందం కారణంగా హార్ముజ్పై అత్యధిక ఆధారపడటం తగ్గుతుంది. పెట్రోల్, ఎల్పీజీ, డీజిల్ సరఫరా స్థిరంగా ఉంటుంది. ధరల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. ప్రజల ఆందోళన తగ్గి, సాధారణ సరఫరా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒప్పందం కేవలం తాత్కాలికంగా కాదు. దీర్ఘకాలికంగా భారత్ ఇంధన దిగుమతులను వైవిధ్యపరచడంలో, సప్లై చైన్ను బలోపేతం చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది.
ప్రస్తుత భూరాజకీయ పరిస్థితులు ఏ సమయంలోనైనా హార్ముజ్ జలసంధిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఒమన్ లాంటి స్నేహపూర్వక దేశంతో బలమైన వాణిజ్య – ఇంధన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం భారత్ దూరదృష్టి, వ్యూహాత్మక విజ్ఞతను చూపుతోంది. ఇది భారత్ ఇంధన భద్రతలో కొత్త అధ్యాయం.

