తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ ( ఉపాధి హామీ పథకం )అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీని ద్వారా లబ్ధిదారులు తమ సొంత ఇంటి నిర్మాణంలో పాల్గొని, 90 రోజుల పాటు రోజుకు సగటున రూ.300 చొప్పున వేతనం పొందవచ్చు.ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.27,000 వరకు లభించనుంది.ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి ఈ ఉపాధి హామీ వేతనం అదనంగా జతకానుంది.జాబ్కార్డు పొందిన లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందవచ్చు.
కలెక్టర్లు,ఎంపీడీవోలే నేరుగా లబ్ధిదారులను గుర్తించి 90 పనిని అందించే అధికారం కల్పించారు.

