మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ను చూసి తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోవాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ నిలిపా రు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ ఎపి రైతులను అక్కడి ప్రభుత్వం ఎంతో బాగా కాపాడుకుంటోందని కెటిఆర్ అభినందించారు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి ఎన్డిఎస్ఏను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడేందుకు కెటిఆర్ దుయ్యబట్టారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని, కేవలం రూ.8.5 కోట్లతో కాపర్ డ్యాం కట్టొచ్చని చెప్పారని, కానీ ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టకుండా దాచిపెట్టిందని కెటిఆర్. తెలంగాణ రక్తం రైతులకు ఇస్తు న్నా కాంగ్రెస్ నీళ్లు ఇవ్వడం.
ఢిల్లీలో కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసిన అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన జరగనున్న ఈ కార్ రేస్ కేసులో తాను కోర్టుకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది తెలంగాణలో తాను స్వయం గా పాదయాత్ర చేస్తానని కెటిఆర్ ప్రకటించారు. గతంలో భారీగా గోదావరి వరదలు వచ్చినప్పుడు మేడిగడ్డ, భద్రాచలం ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం కలగలేదని ఆయన గుర్తుచేశారు. వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే
ఎన్డిఎస్ఏ అనేది కేవలం ఒక సలహా సంఘం మాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలైన ఓనర్ రాష్ట్ర ప్రభుత్వమేనని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం నిర్మాణం చేసి కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాయని కెటిఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం వ్యవహారం అనగానే ఎన్నికల ముందు అకస్మాత్తుగా ఎన్డిఎస్ఏ
రంగంలోకి వచ్చిందని, కేవలం రెండునే రిపోర్ట్ ఇచ్చేసిందని ఆయన గుర్తుచేశారు. అది నిజానికి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కాదనీ, ఎన్డీఏ రిపోర్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎస్ఎల్బిసి టన్నెల్ కూలితే రాణి ఎన్డిఎస్ఏ, అలాగే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కూలితే రాణి ఎన్డిఎస్ఏ ఇక్కడికి ఎందుకు వచ్చిందని కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయం కోసమే ఆయన కుట్ర చేసినట్లు. కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని కెటిఆర్ అభివర్ణించారు.
ఎల్ అండ్ టి చేసిన అప్పులను ప్రభుత్వం ఎందుకు కట్టాలి
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తే అక్కడి నుంచి పారిపోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం ఎయిర్ మెట్రో ఏర్పాటుకు శ్రీ చుట్టి పనులు ప్రారంభించామని, కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ మెట్రోను రేవంత్ రెడ్డి రద్దు చేశారు. మెట్రో భూములు 280 ఎకరాలపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఎలాగైనా వాటిని అమ్మేస్తారని కెటిఆర్ స్థలాలు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టి చేసిన అప్పులను ప్రభుత్వం ఎందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. లోక్సభలో బిఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్లే ఢిల్లీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కెటిఆర్ అన్నారు.
రానున్న రోజుల్లో కెసిఆర్ నెక్స్ సిఎం
రాబోయే రోజుల్లో కెసిఆర్ నెక్స్ సిఎం కావడం ఖాయమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల వచ్చిన నాలుగు సర్వేల ఫలితాలు చూశాకే రేవంత్ రెడ్డి గాబరా పడుతున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని, అయితే, మేం మాత్రం ఎటువంటి సర్వేలు చేయలేదని కెటిఆర్ వివరించారు. తమ నాయకుడు మారలేదని, మా ఎజెండా కెసిఆర్ కూడా మారలేదని కెటిఆర్ అన్నారు. గతంలో రెండుసార్లు ప్రజలు మమ్మల్ని గెలిపించారని, ఈసారి జరిగిన ఓటమికి ప్రజలను మాత్రం బాధ్యులు చేయలేమని కెటిఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి పరిస్థితి ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి సిఎం అభ్యర్థి ఎవరో కూడా తెలంగాణ ప్రజలకు తెలియదని, అక్కడ ఉన్నవారిలో 8 మంది తామంటే తామే సిఎం అని అన్నారు. ఇన్నేళ్లు బిజెపి అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్ పేరుతో 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం
టిఆర్ఎస్ పేరుతో మాకు 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది, అది తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ అని కెటిఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇంకెవరో వచ్చి ఆ పేరును తీసుకుంటామంటే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా అని కెటిఆర్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ అనేది మా క్రెడిబిలిటీ అని, ఆరేళ్ల పాటు టిఆర్ఎస్ అనేది ప్రీజ్ చేయబడిన పేరు అని కెటిఆర్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా మీకు నష్టం చేసే ప్రయత్నం చేస్తే తాము ఎలా ఉంటామని ఆయన హెచ్చరిక.
ఎన్డిఎస్ ఏ కార్యాలయానికి సిఎం ఎందుకు వెళ్లలేదు
రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇప్పటికీ 76 సార్లు వచ్చారని, 76 సార్లు ఢిల్లీకొచ్చిన సిఎం రేవంత్ రెడ్డి కనీసం 76 పైసలైనా రాష్ట్రానికి తీసుకువచ్చారా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఎన్డిఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) అధికారులను ఎందుకు కలవలేదని, ఎన్డిఎస్ఏ కార్యాలయానికి ఎందుకు వెళ్లలేదని కెటిఆర్ నిలదీశారు. నా యుద్ధం, పోరాటం అంతా రేవంత్ రెడ్డితోనేనని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే తాను ప్రశ్నిస్తున్నానని కెటిఆర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయనపై వ్యక్తిగత కక్షలు కూడా లేవని కేటీఆర్ చెప్పారు. అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉంటే బాగుండేదని, దానివల్ల మంచి పేరు ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, భూముల వివాదాలను అన్లాక్ చేసేందుకు ఏకంగా 30 శాతం వసూలు చేసి కెటిఆర్ను నమోదు చేసింది.
సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కేంద్రమంత్రిని కలిశాం
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామిని కలిశామని కెటిఆర్ పేర్కొన్నారు. సిసిఐ ఒక దశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ను నడిపేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే సిసిఐను తెరిపిస్తామని మాట ఇచ్చారని, అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేస్తున్నారని ఈ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.

