2009 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి అప్పీలెట్ ట్రైబ్యునల్ నుండి భారీ ఊరట లభించింది. సౌతాఫ్రికాలో ఐపీఎల్ 2 నిర్వహణ సమయంలో లలిత్ మోదీ వ్యక్తిగతంగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జూలై 16న వెలువడిన తీర్పులో ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మోపిన జరిమానాల ఉత్తర్వులను పూర్తిగా పక్కనబెట్టింది.
ఆ రోజుల్లో భారత్లో సాధారణ ఎన్నికలు ఉండటంతో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ రెండో సీజన్ను అత్యవసరంగా దక్షిణాఫ్రికాకు తరలించాల్సి వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు పంపారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ లావాదేవీలు కరెంట్ ఖాతాకు చెందినవని, క్యాపిటల్కు సంబంధించినవి కాదని ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది. దీంతో ఈడీ తయారు చేసిన కేసును ట్రైబ్యునల్ తిరస్కరించింది.
ఈ తీర్పుపై లలిత్ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. బిసిసిఐ ఫెమా నిబంధనలను పాటించేలా చూడటం లేదా అధికారాలు చాలించడం తన పరిధిలోనిది కాదని ట్రైబ్యునల్ గుర్తించిందని ఆయన తెలిపారు. 16 ఏళ్లుగా తాను చెబుతున్న మాట నిజమని రుజువిందని, భారత క్రికెట్, ఐపీఎల్ మంచి కోసమే తాను నమ్మకంతో నిర్ణయం తీసుకున్నానని, ఎలాంటి వ్యక్తిగత తప్పులు చేయలేదని ఆయన గుర్తించారు.
గతంలో 2018 మే నెలలో ముగిసిన విచారణలో ఈడీ జారీ చేసిన 11 షోకాజ్ నోటీసుల్లో 6 అంశాల్లో లలిత్ మోదీపై రూ.10.65 కోట్ల భారీ జరిమానా విధించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన అప్పీలేట్ ట్రైబ్యునల్లో ఆరు ఎవరైనా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, లలిత్ మోదీని ఐపీఎల్ వ్యవస్థాపకుడు, దక్షిణాఫ్రికాలో టోర్నీని విజయవంతంగా నడిపించిన ముఖ్య రూపశిల్పిగా అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు మార్చడం వల్లనే ఐపీఎల్ నిలబడటమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ప్రాపర్టీగా మారిందని లలిత్ గుర్తుచేసుకున్నారు.
అయితే, లలిత్ మోదీపై ఇంకా పలు మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలు పెండింగ్లోనే ఉన్నాయి. 2010లో దేశం విడిచివెళ్లినప్పటి నుంచి లండన్లోనే తలదాచుకుంటున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి విచారించాలని ఈడీ, సీబీఐ లాంటి భారతీయ దర్యాప్తు సంస్థలు ఎన్నో ఏళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఇప్పటివరకు సఫలం కాలేదు.

