- సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేస్తారని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు.
- కేంద్ర మంత్రివర్గ విస్తరణతో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పుల సూచన.
- ఫడ్నవీస్కు కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్య
దేవేంద్ర ఫడ్నవిస్: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్తారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. రాబోయే ఒకటి నెలల్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని శుక్రవారం సంజయ్ రౌత్ అన్నారు. సీఎం ఫడ్నవీస్కు కీలక బాధ్యతలు అప్పగించాలని, ఒక సీఐ బీజేపీ మంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని అన్నారు.
నాగ్పూర్ పర్యటనలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(యూబీటీ) చేపట్టిన ”రామ రక్షా ఆందోళన” కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆయన నాగ్పూర్ వెళ్లారు. జూలై 18న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించే కానుకల్లో జరిగిన అవకతవకలపై, నిధుల దుర్వినియోగంపై ఈ ఉద్యమాన్ని చేసినట్లు చెప్పారు. ఈ ఉద్యమానికి హిందూ సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్కు ఆహ్వానం పలికినట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాకుంటే ఆయన తరుఫున ఒక ప్రతినిధిని పంపమని కోరినట్లు తెలిపారు. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదని, రామ విశ్వాసం, పారదర్శకత కోసం చేస్తున్న డిమాండ్ అని ఆయన అన్నారు.

