ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వం బలం పుంజుకుంది. వచ్చే 15 ఏళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తామ’ని కూడా చెబుతుంది. ఉన్నతలో సీఎం, డిప్యూటీసీఎంగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలివిడిని ప్రదర్శిస్తున్నారు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక, మిత్రపక్షం బీజేపీకూడా కాలివిడిగానే ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా.. ప్రభుత్వానికి అనుకూలంగా నే ఉన్నారు.
అయితే.. ఈ పరిణామం.. నాణేనికి ఒకవైపు మాత్రమే!. రెండో వైపు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కాలివిడి లోపిస్తోంది. ఎక్కడికడ నాయకుల మధ్య విభేదాలు.. విభేదాలు కొనసాగుతున్నాయి. ఇది పార్టీలకు తలనొప్పిగామారింది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కూడా ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేన’ని చెప్పారు. అయితే.. అందరూ అనుకుంటున్నట్టుగా మాత్రం కాదన్నారు.
అవ’న్నీ చిన్న పాటి విభేదాలేన’ని..కలిసి కూర్చుని మాట్లాడుకుంటే స’మ’ అన్నారు. ఆయన ఈ మాటలు అన్న 24 గంటల్లోనే రాజోలు సహా.. పలు నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటకు పొడచూపాయి. ఇక, పిఠాపురంలో ఎలానూ వివాదాలు కొన సాగుతూనే ఉన్నాయి. త’మ’కు ప్రాధాన్యత లేకుండా పోతోంద’ది జ’నసేన వర్గాలు చెబుతున్న మాట’. టీడీపీ నాయకులు అధిపత్యం చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు.
అంటే.. పైకి చెబుతున్నట్టు.. పైపైన చేస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు.. వివాదాలు చిన్నవి అయితే కావు. అవి పెద్దవిగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవి మరింత పెరగకుండా ఉండాలంటే.. వాటిని చిన్ని చేసి చూస్తే సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేసమయంలో కేవలం ప్రసంగాలతో పనిజరగదని కూడా అంటున్నారు. నాయకులతో మమేకం కావటంతో పాటు.. వారి ఆకాంక్షలు తెలుసుకుని.. దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు. మరి ఆదిశగా కూటమి నాయకులు అడుగులు వేయాల్సి ఉంటుంది.

