ఆంధ్రప్రదేశ్:జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ) పై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ సీనియర్ నేత,జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి (ఎస్.
విష్ణువర్ధన్ రెడ్డి )తెలిపారు.తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సిగ్గుచేటని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి మరియు ఒక ఉప ముఖ్యమంత్రి మధ్య జరిగిన సంభాషణ ఎలా బయటకు వస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోందని అన్నారు.ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ కోణంలో ఉద్దేశపూర్వకంగా చేసినవేనని విష్ణువర్ధన్ రెడ్డి.
రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రాంతీయ భేదాలను ప్రోత్సహిస్తూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు.ప్రజాస్వామిక విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలకు ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల విషయంలో తానే తప్పు ఒప్పుకోవడం గమనార్హమని ఆయన,ప్రజా వేదికలపై మాట్లాడే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

