తెలంగాణ:మానవుని మనుగడకు అక్షరము ఆయుధమైతే, దేశ మనుగడకు “సోషల్ మీడియా” వజ్రాయుధము.సోషల్ మీడియా రెండు వైపులా పదునైన అస్త్రం.
సామాన్యుడి చేతిలో ఆయుధం అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి.స్వరూపరెడ్డి (P.Swarupa Reddy )అన్నారు.ఒకప్పుడు ప్రింట్ మీడియాకు,తరువాత ఎలక్ట్రానిక్ మీడియాకు ఆదరణ లభించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.ఎవరైనా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.
వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.కానీ, సోషల్ మీడియా అనేది అత్యంత చౌకైనది.
దీనికి పెద్దగా అర్హతలతో పనిలేదు.మొదట టెలిఫోన్, తరువాత ఫ్యాక్స్ మెషిన్,ఆపై సోషల్ మీడియా-మానవ జీవన పరిణామంలో ఒకరినుంచి మరొకరికి కమ్యూనికేట్ చేయడానికి ఒక విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
సోషల్ మీడియా సృష్టించినప్పటి నుండి,ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలిగారు.నేడు సోషల్ మీడియా అభివృద్ధి చెందింది జనాదరణ పెరిగింది, సోషల్ మీడియా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తక్షణమే కనెక్ట్ అయ్యే మార్గంగా మారింది.
ఈ సామాజిక వార్తలు, షాపింగ్ మరియు సాధారణ వినోదాలకు భారీ వనరుగా మారింది.ఈ సామాజిక మాధ్యమాన్ని మనం సమాజ వికాసం కోసం వాడాలి.
అనవసర అంశాలు,వివాదాలు సృష్టించే అంశాలు,చెడు ప్రచారం,ఇతరుల మనోభావాలకు భంగంకలిగేలా పోస్టులు పెట్టడం,కులమత సంఘర్షణలను కలిగించే అంశాలు పోస్టు చేయడం మంచిదికాదు,చట్ట ప్రకారం నేరంకూడా.నేడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సామాజిక మాధ్యమాలపై పూర్తిగా ఆధార పడ్డారు.
విషయాలను పంచుకోవడానికే కాదు,ఆన్లైన్ షాపింగ్ కూడా నేడు సామాజిక మాధ్యమం ప్రధాన సాధనం అయ్యింది.రాజకీయ పార్టీలు( రాజకీయ పార్టీలు ) కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకుని తాము చేసే కార్యక్రమాలకు ప్రచారం కల్పించుకుంటున్నారు.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు వస్తున్నాయి.అలాగే కొందరు అసభ్యకరమైన భాషని సోషల్ మీడియాలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
దీని వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది.ఈ మీడియా ద్వారా పెద్దగా ఖర్చు లేకుండా సామాన్యులు సైతం పాలక వర్గాల పని తీరును ప్రశ్నించవచ్చు.
ప్రజలు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలను వెలుగులోకి తీసుకొని రావచ్చు.సోషల్ మీడియాను సమాజ వినాశనానికి గానూ సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని సూచించారు.


