భారతదేశం : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారతదేశం: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్ఓ ద్వారా ఖాతాదారులకు వడ్డీ జమ, ఆటో క్లెయిమ్ సదుపాయం మరియు కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖాతాదారులందరికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్రం అనుమతించింది.
7.8 కోట్ల మందికి లబ్ది…
దీని ద్వారా దాదాపు 7.8 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. మీ ఖాతాలో రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, దాదాపు రూ.40,000 వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. రూ. 5 లక్షల వరకు ఆటో క్లెయిమ్:ఖాతాదారులకు అత్యవసర సమయాల్లో డబ్బులు త్వరగా అందేలా ‘ఆటో క్లెయిమ్’ సదుపాయం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పీఎఫ్ అడ్వాన్స్ లేదా ఇతర క్లేయిమ్లను సులభంగా మరియు వేగంగా పొందవచ్చు.
వార్తల సారాంశం – పీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది

