భారతదేశ మామిడిపండ్లు | భారత మామిడి రైతులకు (మామిడి రైతులు) మరో చేదువార్త వచ్చింది. జపాన్ (జపాన్) బాటలోనే నేపాల్ (నేపాల్) కూడా నడిచింది. భారత మమాడి పండ్ల దిగుమతులపై ఇప్పటికే జపాన్పై నిషేధం విధించగా.. ఇప్పుడు నేపాల్ కూడా నిషేధం విధించింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నేపాల్ నిషేధించింది.
India Mangoes : భారత మామిడి రైతుల (మామిడి రైతులు) కు మరో చేదువార్త వచ్చింది. జపాన్ (జపాన్) బాటలోనే నేపాల్ (నేపాల్) కూడా నడిచింది. భారత మమాడి పండ్ల దిగుమతులపై ఇప్పటికే జపాన్పై నిషేధం విధించగా.. ఇప్పుడు నేపాల్ కూడా నిషేధం విధించింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నేపాల్ నిషేధించింది. అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధిస్తున్నట్లు బాలెన్ షా ప్రభుత్వం ప్రకటించింది.
నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లో ఒకటి కానప్పటికీ.. ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా, బంగనపల్లిలో అనేక రకాల భారతీయ ఎగుమతులపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది. నేపాల్ కూడా పరిమితంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్థానిక డిమాండ్ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు.
మే మధ్య నుంచి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. మధేష్ ప్రావిన్స్లోని సిరహా, సప్తరి , ధనుషాలు దేశంలోని ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నేపాల్ అధికారులు చెబుతున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో సుమారు 32 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతి చేస్తుండగా.. మిగిలినవి దేశీయంగా వినియోగమవుతున్నాయి.

