Ram Charan And Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. థియేటర్స్ లో గత మూడు వారాల నుండి అద్భుతంగా రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ సినిమా, కొన్ని డిగ్రీల అధిక రేట్ల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోలేకపోయింది, నటుడిగా రామ్ చరణ్ పూర్తి స్థాయిలో సంతృప్తి పడేలా చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాకు ఆయన పడినంత కష్టం , ఏ సినిమాకు కూడా పడలేదు, అది మన కళ్ళకు స్ఫష్టంగా వచ్చింది. 21 రోజుల్లో 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం , దాదాపుగా థియేటర్లలో రన్ ని పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చేసింది. నిన్ననే ఈ చిత్ర విజయానికి సంబంధించిన సభ చాలా గ్రాండ్ గా జరిగింది మేకర్స్.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ గురించి , పెద్ది చిత్రం గురించి గొప్పగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రామ్ చరణ్, పనిలో పనిగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ ని కూడా సందర్శించాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి కాసేపటి క్రితమే సోషల్ మీడియాలో విడుదలై బాగా వైరల్ అయ్యింది. టీ బ్లాక్ షర్ట్ , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని రామ్ చరణ్ ఒక పక్క స్టైల్ గా నడుస్తుంటే , మరో పక్క పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో , కూలింగ్ గ్లాసెస్ తో కనిపిస్తూ , ఫోన్ చూస్తూ నడుస్తున్నాడు.
ఈ ఫొటోలో వీళ్లిద్దరి స్టైల్ , స్వాగ్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు బాబాయ్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో గడిపాడట రామ్ చరణ్. 2019 ఎన్నికల తర్వాత , రామ్ చరణ్ జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ కి రావడం ఇదే రెండవ సారి. గతం లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా , వడదెబ్బ సోకి పడిపోయారు. ఆ సమయం లో పవన్ కళ్యాణ్ ని ఓదార్చేందుకు వచ్చిన రామ్ చరణ్ , మళ్లీ ఇన్నాళ్లకు జనసేన పార్టీ ఆఫీస్ లో దర్శనం ఇవ్వడం అభిమానులకు పండగ వాతావరణాన్ని తలపించింది.

