అండమాన్ గ్యాస్ ఆవిష్కరణ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం. హర్మూజ్ను ఒప్పందంతో గల్ఫ్ దేశాల నుంచి రమురు, సీఎన్జీ, ఎల్ఎన్జీ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా వంటి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిలో తాజాగా భారతీయుల గ్యాస్ కష్టాలు తీరే ఒక వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) మరోసారి సంచలనం సృష్టించింది. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 మీటర్ల దూరంలో, 355 మీటర్ల లోతట్టు సముద్ర జలాల్లో విజయపురం–3 అన్వేషణ బావిలో సహజ వాయువు ఉనికిని గుర్తించింది.
ఓఐఎల్ రెండో విజయం..
ఇది ఓఐఎల్ సంస్థ ఆండమాన్ బ్లాక్లో రెండో విజయం సాధించింది. గత సెప్టెంబర్ 2025లో విజయపురం–2 బావిలో మొదటి ఆవిష్కరణతోపాటు, ఇప్పుడు బావిలో కూడా గ్యాస్ ఉనికి తెలియడంతో అండమాన్–నికోబార్ బేసిన్ హైడ్రోకార్బన్ రెండో ప్రమాదంపై ఆశలు భారీగా పెరిగాయి.కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ పురి ఇంధన అవకాశాల సముద్రం అని అభివర్ణించారు. ఇది దేశం ఇంధన భద్రత, ఆర్థిక స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఒక ముఖ్యమైన మైలురాయి.
అండమాన్ బేసిన్లో అన్వేషణ..
ఈ బ్లాక్ 2019లో ఆయిల్ ఇండియాకు కేటాయించబడింది. సంస్థ మూడు బావుల అన్వేషణ క్యాంపెయిన్ను చేపట్టింది. విజయపురం–2లో 87 శాతం మీథేన్ కంటెంట్తో గ్యాస్ లభించలేదు, ఇప్పుడు విజయపురం–3లో కూడా గ్యాస్ ఫ్లో నిర్ధారణ అయింది. గ్యాస్ నమూనాల విశ్లేషణ, అప్ప్రైజల్ కార్యక్రమం ఇప్పటికే ఉంది. అండమాన్ బేసిన్ ఇప్పటి వరకు తక్కువ అన్వేషణ జరిగిన ఫ్రంటియర్ బేసిన్గా పరిగణించబడుతుంది. మయన్మార్, ఇండోనేషియా వంటి పొరుగు దేశాల్లోని ఉత్పాదక బేసిన్లతో భూగర్భ నిర్మాణ సారూప్యతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారత్కు కొత్త ఆశలు కల్పిస్తోంది.
ఇంధన భద్రతకు కీలకం..
భారత్ ప్రస్తుతం సహజ వాయువుల ఉత్పత్తులలో తన దిగుమతి చేసుకుంటోంది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక, నగరీకరణతో గ్యాస్ డిమాండ్ సంవత్సరానికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక నిక్షేపాలు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి, ఇంధన ఖర్చులు తగ్గుతాయి, జాతీయ భద్రత బలపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2025లో ప్రారంభించిన ‘సముద్ర మంథన్’ మిషన్కు ఈ ఆవిష్కరణలు ప్రత్యక్షంగా మద్దతునిస్తాయి. లోతట్టు సముద్ర అన్వేషణను ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం.
ఇంకా ఆవిష్కణ దశలోనే..
అయితే ఉత్సాహంతో పాటు వాస్తవికతను కూడా గుర్తించాలి. ఇవి ఇంకా ఆవిష్కరణలోనే ఉన్నాయి. వాణిజ్య సాధ్యత, నిక్షేపాల పరిమాణం, ఉత్పత్తి వ్యయాలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. లోతట్టు సముద్ర ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చాలా ఖరీదైనది, సవాల్తో కూడుకున్నది. పర్యావరణ సున్నిత ప్రాంతంగా పర్యావరణ రక్షణ, స్థానికుల హక్కులు, సముద్ర జీవ వైవిధ్యం కాపాడటం వంటి అంశాలు కూడా కీలకం.
అండమాన్ సముద్రంలో ఆయిల్ ఇండియా సాధించిన వరుస విజయాలు భారత్ ఇంధన రంగ చరిత్రలో ముఖ్యమైన మలుపు. ఇంధన దిగుమతి నుంచి విముక్తి పొందడానికి, ఆర్థిక బలం పెంచుకోవడానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి ఒక బలమైన ఆధారం. సరైన దిశలో అడుగులు వేస్తే, అండమాన్ భారత్ యొక్క కొత్త ఇంధన హబ్గా ఎదగడం ఖాయం.

