మహిళలు సమస్యను పరిష్కరించిన అధికారులు
విశాలాంధ్ర – కంబదూరు: కంబదూరు మండల కేంద్రంలోని కోటవీధి మసీదు వెనుక కాలనీలో 25 రోజులుగా కొనసాగుతున్న సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాడీవో సూర్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో నీలావతి, పంచాయతీ కార్యదర్శి మహేష్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినప్పటికీ మహిళలు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వెంటనే అధికారులు అప్రమత్తమై వాటర్ ట్యాంక్కు సంబంధించిన నీటి ట్యాంక్కు సంబంధించిన వాల్వ్ను మరమ్మతులు చేయడంతో పాటు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఆరు గంటల వ్యవధిలోనే కాలనీలో మరమ్మతులు జరిగాయి. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన అధికారులు, సిబ్బందికి కాలనీ మహిళలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

