మహేంద్రగిరి వారాహి టీజర్ రివ్యూ: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇలాంటి ఇష్టంనే సుమంత్ హీరోగా ‘సంతోష్ జాగర్లపూడి’ దర్శకత్వంలో తనకిచ్చిన ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమాకి సంబంధించిన టీజర్ గత కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ లో కథను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మహేంద్రగిరి రాజవంశంలో 33 సంవత్సరాలు వచ్చిన ప్రతి మగ బిడ్డ చనిపోతున్నాడు. దానికి కారణం అమ్మవారి శాపమా అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమానైతే తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుమంత్ మరోసారి ఒక డీసెంట్ కల్ట్ క్లాసికల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఈ టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా హై విజువల్స్ తో ప్రేక్షకుడికి ఒక సూపర్ ట్రీట్ ఇచ్చే సినిమాగా కనిపిస్తుంది. ముఖ్యంగా డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పటికీ ఇందులో ప్రతి ఎలిమెంట్ కూడా ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇచ్చే విధంగా కనిపిస్తుంది.
అలాగే దానికి తోడు సినిమాలో సీజీ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా కనిపించింది. ముఖ్యంగా ఒక పాంథర్ ఎవరి పైనో దూకుతున్నట్టుగా అది ఎవరి మీదనో ఎటాక్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. మరి హీరో దానిని నుంచి ఎవరిని సేవ్ చేస్తున్నాడు అనేది కూడా టీజర్ లో చాలా మిస్టేరియస్ గా చూపించారు. అలాగే ఐశ్వర్య రాజేష్ మాళవిక నాయర్ ల క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది… మొత్తానికైతే ఈ టీజర్ ఎండింగ్ లో వారాహి అమ్మవారు ఉగ్రరూపమైతే మనకు చూపించారు… అది ఈ టీజర్ మొత్తానికైతే హైలెట్ అంటే చెప్పాలి…
అంటే ఈ సినిమాలో అమ్మవారు అంతర్లీనంగా భాగమవ్వడమే కాకుండా సినిమా మొత్తం ఆమె మీద బేస్ చేసుకుని నడుస్తుందనే విషయం మనకు చాలా క్లారిటీగా తెలిసింది. ఇక సుమంత్ మరోసారి కల్ట్ క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయం కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది…

