- సుప్రీంకోర్టులో హనీమూన్ మర్డర్ కేసు విచారణ
- ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరే చేశారు’
- సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితులు సోనమ్ రఘువంశీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త రాజా రఘువంశీపై దాడి జరిగిన తర్వాత ఆమె ప్రవర్తనపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అవసరమైతే సోనమ్ బెయిల్ను రద్దు చేసి లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని సూచించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మంగళవారం ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలే ధర్మాసనం మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. సోనమ్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం సోనమ్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించింది. ”మీ ప్రవర్తనను ఎలా సమర్థించుకుంటారు? పోలీసుల కథనం ప్రకారం మీరు, మీ భర్త ఇద్దరూ కలిసి ఆ వెళ్లారు. అక్కడే ఆయనపై దాడి జరిగి మరణించాడు. ఆ తర్వాత మీరు ఏం చేశారు? ఇదే ప్రధాన ప్రశ్న. అలాగే అరెస్ట్ కారణాలపై మీరు మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేశారా?” అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో వాదనలు విన్న తర్వాత మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని లేదా సోనమ్ లొంగిపోయి ట్రయల్ను ఆదేశిస్తామని ధర్మాసనం ప్రదర్శించారు.
సుందరేశ్ మాట్లాడుతూ.. ”మా ఆలోచన మీకు ముందే చెబుతున్నాను. మీకు ఆశ్చర్యం కలగకుండా, మా అభిప్రాయం ఏంటో అర్థం చేసుకునేందుకు ఈ సూచన చేస్తున్నాం. మీ క్లయింట్ నుండి సూచనలు తీసుకుని మళ్లీ కోర్టుకు రండి.” అని సోనమ్ తరఫు న్యాయవాదికి సూచించారు.
మేఘాలయ ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వివాహం అనంతరం హనీమూన్ కోసం రాజా, సోనమ్ మేఘాలయకు వెళ్లారని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సోనమ్ ముందుగానే కుట్ర పన్ని తన భర్తను కొండ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిందని, ఆమె ప్రియుడు ఏర్పాటు చేసిన ముగ్గురు వ్యక్తులను అనుసరించారని వివరించారు. ముందుగా రాజాను హత్య చేసి మృతదేహాన్ని లోయలోకి తోసివేశారని దర్యాప్తులో తేలిందని తెలిపారు. హత్య అనంతరం అక్కడి నుంచి పరారైందని, తర్వాత ఆమె ప్రియుడు పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్పడంతో ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు. అరెస్ట్ చేయడానికి కారణాలు సోనమ్కు పూర్తిగా తెలుసు కూడా తుషార్ మెహతా వాదించారు.
సోనమ్ తరఫు న్యాయవాది మాత్రం ఈ కేసును మీడియా అతిగా ప్రచారం చేసిందని.. ఇది పూర్తిగా ఆధారాలపై నడుస్తున్న కేసునని వాదించారు. అయితే ఈ దశలో ప్రాసిక్యూషన్ ఆరోపణలపై సవివరంగా చర్చించబోమని సుప్రీం స్పష్టం చేసింది. బెయిల్ చేసే సమయంలో అరెస్ట్ మెమోలో ఉన్న టైపోగ్రాఫికల్పాటును హైకోర్టు తీసుకోవడం సమంజసమేనా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

