లోహగడ్ కోట: మహారాష్ట్రలో పూణేకు 90 దూరంలో ఉన్న లోహ్ గడ్ కోట చరిత్రాత్మకమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది పర్యటకులు వస్తూనే ఉంటారు. ఈ కోట అత్యంత పురాతనమైనది. ఇక్కడి ప్రాంతాలు అందంగా ఉంటాయి. గత చరిత్రను కళ్ళ ముందు ఉంచుతాయి. కానీ.. ఈ కోటను సందర్శించడానికి ఇటీవల కాలంలో పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ పర్యటకుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. దీనికి కారణం ఒకే ఒక్క యువతి.
ఇటీవల లోహ్ గడ్ కోట లోయలో కేతన్ అనే వ్యాపారి పడి చనిపోయిన విషయం తెలిసిందే. అతడిని చంపిన ఘటనలో కాబోయే భార్య సియా, అతడి ప్రియుడు చేతన్ ముఖ్యపాత్ర పోషించారు. అతడిని చంపడానికి వారిద్దరు అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందించారు. చివరికి చంపేసి వారికి అడ్డు లేకుండా చూసుకున్నారు. కానీ చట్టం అనేది ఒకటుందని.. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నారని వారు ఊహించలేకపోయారు. చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ ఘటనలో సంచలనం సృష్టించింది. తినే పద్యంలో ఈ కోటను సందర్శించడానికి పర్యాటకులు పెరిగిపోయారు. గతంతో పోల్చి చూస్తే 25% మంది పర్యాటకులు పెరుగుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ కోట చివరి ప్రాంతంలోకి సియా ఎక్కడినుంచి కేతన్ ను నెట్టివేసిందో పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కేతన్ ను నెట్టి వేసిన ప్రాంతాన్ని సియా పాయింట్ గా అభివర్ణించారు. ఒక పాయింట్ ను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఒకప్పుడు ఒక హత్య జరిగితే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. అక్కడ ఏమైనా ప్రతీప శక్తులు ఉంటాయేమోనని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పైగా ఆ సంఘటన గురించి.. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి.. పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతైనా నేటి సోషల్ మీడియా కాలంలో మనుషులు పూర్తిగా మారిపోయారు.

