ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న యూజర్ల సేఫ్టీ కోసం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. OTPలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించడానికి మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగించే సమయంలో ఈ ఫీచర్లు వినియోగదారులకు ఎక్స్ట్రా సెక్యూరిటీని అందిస్తాయి.
వాట్సాప్లో ఇప్పుడు సైలెన్స్ తెలియని కాలర్స్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ తో తెలియని నంబర్ల నుంచి వచ్చే స్కామ్ కాల్స్ ఆటోమెటిక్గా సైలెంట్ అవుతాయి. అంతేకాదు అన్ నౌన్ నంబర్ల నుంచి మేసేజ్ వస్తే Context Cards ద్వారా ఆ నంబర్ గురించి అదనపు సమాచారం అందించబడుతుంది.
చాలా మంది స్క్రీన్ షేర్ చేస్తూ OTPలు, బ్యాంకింగ్ వివరాలు కోల్పోతున్నాయి. వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేర్ చేయడానికి వార్నింగ్ ఇస్తుంది. మరో వైపు మీ వాట్సాప్ కోసం వేరే డివైజ్ కు లింక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే అలర్ట్ వస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రెండు దశల వెరిఫికేషన్ (రెండు-దశల ధృవీకరణ) ఫీచర్ ద్వారా ఖాతాకు అదనపు సెక్యూరిటీ లభిస్తుంది. ఆరు అంకెల పిన్ లేకుండా ఖాతాలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ ఉంటుంది.
ఆన్ లైన్ మోసాలు పూర్తిగా తగ్గకపోయినా, యూజర్లు అప్రమత్తంగా ఉంటేనే సురక్షితం. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త భద్రతా ఫీచర్లు డిజిటల్ భద్రతలో కీలక అడుగులు వేస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

