నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాలకేజీ అంశంపై, సీజేపీ చేపట్టిన ఉద్యమానికి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన మద్దతు తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విద్యార్థి దశకు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ, ఈ వివాదంపై ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీ అనేది అత్యంత తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యా వ్యవస్థ సాధన కోసం విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయడం అభినందనీయమని సల్మాన్ ప్రకటించారు. అయితే, శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని తెలియజేశారు.
ఈ ఉద్యమ ఘనత అంతా విద్యార్థులకే చెందాలని, ఈ సున్నితమైన సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించింది, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత్ అంతర్జాతీయ విద్యా కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుతం సల్మాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ విద్యార్థి ఉద్యమానికి నసీరుద్దీన్ షా, జీనత్ అమన్, సోనాక్షి సిన్హా, ఓమీ వైద్య వంటి సినీ ప్రముఖులు తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పోస్ట్ సీజేపీ ఉద్యమానికి సల్మాన్ మద్దతు.. మొదట కనిపించింది నవతెలంగాణ.

