టాలీవుడ్లో డ్యూయల్ రోల్ ట్రెండ్: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు సింగల్ పాత్రలో నటించిన కూడా ఇప్పుడు డ్యూయల్ రోల్ పక్కా ఉండాల్సిందే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు 5 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా, అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు… ఆ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ కూడా రెండు పాత్రలను పోషిస్తున్నట్లుగా ఉంది. అందులో ఒకటి నెగెటివ్స్ ఉన్న పాత్ర కాగా, మరొకటి హీరో పాత్ర కావడం విశేషం… ఇలా స్టార్ హీరోలు రోల్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూండటం చూస్తున్న ప్రతి ఒక్కరు వీళ్ళు ఎందుకని అలా చేస్తున్నారు అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఒక్క టైం లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు డ్యూయల్ రోల్ ట్రెండ్ నడుస్తుందని ప్రతి ఒక్కరు కోరుతున్నారు…
మరి ఈ ఫీవర్ ఎన్ని రోజులపాటు ఉంటుంది. ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి తోడుగా మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కాబట్టి సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది.
వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ లో నటిస్తారా లేదంటే రెండు క్యారెక్టర్లలో నటిస్తారనే విషయం పక్కన పెడితే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది… ఇక దర్శకులు సైతం హీరోలను స్క్రీన్ మీద ఎక్కువ సేపు చూడాలని అభిమానులు కోరుకుంటారు.
కాబట్టి ఎటు చూసినా వాళ్లే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేక్షకుడికి హీరోని ఎక్కువసేపు చూశామనే సంతృప్తి కలుగుతుంది. అలాగే సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడితే ప్రేక్షకుడు రిపీటెడ్ గా థియేటర్ కి వచ్చి సినిమా చూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది…

