Pawan Kalyan Health : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన రివ్యూ మీటింగ్ లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురి అవ్వడం, వెంటనే హాస్పిటల్ కి తరలించి ముక్కు కి సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ , మరోసారి పాలన పరంగా ఫుల్ యాక్టీవ్ అవ్వడమే కాకుండా, పార్టీ ని కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం ప్రారంభించారు. వీటితో పాటు కోట్లాది సినీ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న ‘ఓజీ 2’ చిత్రం కోసం కూడా ఆయన రెడీ అయిపోయారు. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయం లో మరోసారి ఆయన వైద్యుల కోసం ముంబై కి వెళ్లడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. కాకుండా తన భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం అవ్వడం వల్ల, రెండు భుజాలకు సంబంధించిన కండరాలు పూర్తిగా చిట్లిపోయాయి. ఈ కారణం చేత ఆయన ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా కూడా ఆయన క్యాబినెట్ మీటింగ్ లో ఎక్కువసేపు కూర్చోలేక మధ్యలో వెళ్లిపోయిన సందర్భం కూడా ఒకటి. దీనికి శాశ్వతంగా నేడు ఆయన ముంబై కి వెళ్లాల్సి వచ్చింది.
కాసేపటి క్రితమే ముంబై కి చేరుకున్న పవన్ కళ్యాణ్, కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ కి వెళ్లనున్నారు. ఆయనకు తోడుగా సతీమణి అన్న లెజినోవా కూడా వచ్చింది. భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎన్నో కార్యక్రమాలు , యాత్రలు చేయాల్సి ఉంది , అదే విధంగా వృత్తిపరంగా సినిమాలను కూడా ప్రారంభించే సమయం వచ్చేసింది , నవంబర్ నుండి ఓజీ 2 షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కి వచ్చారని, భయపడాల్సిన అవసరమే లేదని అభిమానులు అంటున్నారు. త్వరలోనే కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మాటమంతి మొదలు పెట్టనున్నారు. రీసెంట్ గానే కాకినాడ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం వ్యాపించనుంది.

