- దోమలగూడ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు
- కాచిగూడ రైల్వే స్టేషన్లో సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు
- ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
- సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి
తప్పిపోయిన బాలికలు: ప్రస్తుతం దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కుటుంబాలకు చెందిన స్నేహ కుమారి, లలిత కుమారి, లత అనే ముగ్గురు బాలికలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. హిమాయత్నగర్ మెయిన్ రోడ్డు వద్ద వీరు ఆటో ఎక్కినట్లు పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ఆ తర్వాత రూట్ను ట్రాక్ చేయగా, సదరు బాలికలు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో దిగినట్లు అక్కడి సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
బాలికలు ఎంతకీ ఇంటికి రా ఆందోళన చెందిన తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ విజువల్స్ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు పిర్యాదు చేసి సహకరించాలని అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేశారు.

