DRDO తాజా రక్షణ సాంకేతికత: భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫేజ్-2 బీఎండీ వ్యవస్థలోని ఏడీ-1, ఏడీ-2 ఇంటర్సెప్టర్ మిస్సైల్లు విజయవంతంగా పనిచేశాయి. ఈ సాధనతో భారత్తో ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ల వంటి దీర్ఘ-దూర బెదిరింపులను అడ్డుకునే దృశ్యాన్ని ప్రదర్శించింది. ఇది దేశ రక్షణ వ్యవస్థకు కొత్త బలాన్ని జోడించి, వ్యూహాత్మకతను మార్చే అవకాశం కల్పిస్తుంది.
ఒడిశా తీరంలో పరీక్ష..
డీఆర్డీవో ఇటీవల ఒడిశా తీరంలో నిర్వహించిన శ్రేణి పరీక్షల్లో ఏడీ-1, ఏడీ-2 ఇంటర్సెప్టర్లు విజయవంతంగా పనిచేశాయి. ఈ మిస్సైల్లు ఇన్కమింగ్ బాలిస్టిక్ మిస్సైల్లను వాతావరణం లోపల (ఎండో-అట్మాస్ఫెరిక్), వెలుపల (ఎక్సో-అట్మాస్ఫెరిక్) రెండు ప్రాంతాలనూ అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రత్యేకంగా, మధ్య-దశ (మిడ్-కోర్స్)లో ఉన్న లక్ష్యాలను గుర్తించి, నాశనం చేసే సాంకేతికతను ఈ వ్యవస్థ అందించింది. 2 వేల కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం వినియోగంగల బాలిస్టిక్ మిస్సైల్లను ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ సెప్టెంబరు అధునాతన రాడార్లు, డిస్ట్రిక్ క్రిమినేషన్, హిట్-టు-కిల్ సాంకేతికతతో సన్నద్ధమయ్యాయి. ఇది ఫేజ్-1 బీఎండీకి అదనంగా మరింత విస్తృతమైన రక్షణ పొరను అందిస్తుంది.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు ..
ఈ విజయంతో భారత్ అధునాతన బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన కొద్ది దేశాల్లో ఒకటిగా అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతోపాటు ఈ సాంకేతికతను కలిగిన ఎలైట్ గ్రూపులో భారత్ చేరింది. ముఖ్యంగా ఎక్సో-అట్మాస్ఫెరిక్ మిడ్-కోర్స్ ఇంటర్సెప్షన్ సామర్థ్యం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఇతర దేశాల రక్షణ వ్యవస్థలకు కూడా ఇది ఒక ముఖ్యమైన సంకేతం. చైనా వంటి దేశాలు అభివృద్ధి చేసిన దీర్ఘ-దూర మిస్సైల్లను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది భారత స్వావలంబన లక్ష్యానికి బలమైన ఉదాహరణ.
వ్యూహాత్మక ప్రాముఖ్యత..
ఈ సాధన భారతదేశానికి రెండు ప్రధాన ప్రయోజనాలు కల్పిస్తుంది. మొదటిది, నిరోధక శక్తి. శత్రు దేశాలు బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసినా, దాన్ని మధ్యలోనే అడ్డుకోగల సామర్థ్యం ఉండటం వల్ల దాడి చేయడానికి వారు వెనుకాడతారు. ఇది భారత్ యొక్క “ ఫస్ట్ యూజ్” మరింత బలపరుస్తుంది. రెండోది బహుళ-పొర రక్షణ. ఒక్క పొర మాత్రమే కాకుండా, ఎండో ఎక్సో రెండు పొరలు కలిపి ఉండటం వల్ల లోపాలు తక్కువ. ఇది పాకిస్థాన్, చైనా వంటి సరిహద్దు బెదిరింపుల నుంచి నగరాలు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ఆస్తులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ విజయం పూర్తి కార్యాచరణ స్థాయికి చేరుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. రాడార్ నెట్వర్క్ విస్తరణ, ఇంటిగ్రేషన్, నిరంతర పరీక్షలు అవసరం. అయినప్పటికీ, స్వదేశీ సాంకేతికతతో ఇంత పెద్ద ముందడుగు వేయడం భారత రక్షణ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది.

