భార్యాభర్తల బంధం విచ్చినం కాకుండా కాపాడే బంగారు సూత్రం!
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, రెండు విషయాలలో వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది. బంధాలను కాపాడుకోవడం, మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటినీ ఎలా సరిదిద్దుకోవాలంటే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే..
బంధాలకు బంగారు సూత్రం..
నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే. బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ పరిశీలన స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు. ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.
ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం తర్వాత, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం.
ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వభావాలు, కొన్ని లోపాలు ఉంటాయి. భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం కనిపిస్తుంటుంది.
వివాహం విషయానికి వస్తే.. సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది. అక్కడ వివాహానికి ముందు రాముడి యోగ్యతను పరీక్షించాడు, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమను త్వరగా మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు నాశనం అవుతున్నాయని చాలా మంది అర్థం చేసుకోలేరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి.
ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శించుకోలేక పోవడం, అలాగే.. తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవుతాయి, మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది. బంధం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.
*రూపశ్రీ.

