బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, దీనిని అనుమతించాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఃమహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కోర్టును ఆశ్రయించాడు.
ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్, గ్యాంగ్స్టార్-ఉగ్రవాద నెట్వర్క్కు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేయడంతో ఢిల్లీలోని తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2025 నవంబర్లో అమెరికా నుంచి అతడిని భారత్కు అప్పగించిన విషయం తెలిసిందే. ఎన్ఐఏ కేసులో జైలులో ఉన్నందున, న్యాయపరమైన ఆదేశాలు లేకుండా ముంబై కోర్టులో హాజరుకాలేనని, అందువల్ల అతన్ని కోర్టులో హాజరుపరిచేలా తిహార్ జైలు అధికారులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయవలసి ఉంది.
న్యాయమైన విచారణ స్వచ్ఛందంగా లొంగిపోయి, న్యాయ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని అన్మోల్ తన అప్లికేషన్లో చేర్చాడు. తాను లొంగిపోవడం వల్ల ప్రాసిక్యూషన్కు ఎలాంటి నష్టం జరగదని, పైగా విచారణ వేగవంతం కావడానికి దోహదపడుతుందని వాదించాడు. గురువారం ఈ పిటిషన్పై స్పందించిన ప్రత్యేక జడ్జి ఎస్ఆర్ నవేందర్, సమాధానం దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తీసుకున్నారు.
2024 ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసంపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపిస్తూ ముంబై పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విక్కీ గుప్తా, సాగర్ పాల్ సహా ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, వారిపై విచారణ కొనసాగుతోంది. మరో నిందితుడు అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలో మరణించాడు. లారెన్స్ బిష్ణోయ్తో పాటు అన్మోల్ను కూడా ఈ కేసులో వాంటెడ్ నిందితులుగా పోలీసులు గుర్తించారు.

