ఢిల్లీలోని జంతర్ మంతర్లో మళ్లీ ఉద్రిక్తత. జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్పై ఆంక్షల విషయంలో పోలీసులు, సీజేపీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కొందరు నిరసనకారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మారింది.
దీంతో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు లాఠీలకు చెప్పారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సహాయ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాలతో జంతర్ మంతర్లో మరోసారి హైటెన్షన్ వాతావరణం. మరోవైపు.. సీజేపీ నిరసనలతో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియా ద్వారా ఆకతాయిల పుకార్లు జరగకుండా ఉండేందుకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల, భద్రతా బలగాల అదుపులో ఉంది.
జంత్ మంతర్లో ఇంటర్నెట్ బంద్
నీట్ 2026 పేపర్ లీక్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని తెలిపారు.
జంతర్ మంతర్లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులను అణగదొక్కేందుకు మోడీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
►ఇంకా చదవండి | వరుస నిరసనలతో ఢిల్లీ షేక్.. జంతర్ మంతర్లో ఇంటర్ నెట్ బంద్

