ప్రధాని మోదీ | నీట్(NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు.
ప్రధాని మోదీ | నీట్(NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను (ఫాస్ట్ ట్రాక్ కోర్టు)ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు. పేపర్ లీక్ ఘటనల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు సంబంధిత అధికారులను సూచించినట్లు చెప్పారు. విద్యార్థులను పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలాగే మన యువతకు హాని కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
మన యువత సంక్షేమం మరియు భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదు!
పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిని త్వరగా మరియు కఠినంగా శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, అధికారులను ఆదేశించారు…
– నరేంద్ర మోదీ (@narendramodi) జూలై 23, 2026

