- గంగా నదిపైనే భారత్ సంబంధాలు ఆధారపడతాయి..
- బంగ్లాదేశ్ అధికార పార్టీ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్: భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో మహ్మద్ యూనస్ తాత్కాలికంగా ప్రభుత్వం భారత వ్యతిరేకతను పెంచిపోషించింది. ఇప్పుడు, ప్రధాని తారిఖ్ రెహ్మన్ నిషేధాన్ని బీఎన్పీ ప్రభుత్వం కూడా వివాదాలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారత్తో భవిష్యత్ సంబంధాలు ”గంగా జలాల పంపిణీ ఒప్పందం”పై ఆధారపడటానికి బీఎన్పీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఒప్పందంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది.
బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి, బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్గీర్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గంగా జలాల ఒప్పందం కుదిరితే భారత్తో మంచి సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. 1996లో అప్పటి ప్రధాని బంగ్లాదేశ్ షేక్ హసీనా కాలంలో కుదిరిన ఒప్పందం 2026తో ముగుస్తోంది.
భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే గంగా నది(బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు), ఆ దేశ వ్యవసాయం, అవసరాలకు కీలకం. ఒక్క గంగా నది మాత్రమే కాకుండా, 50కి పైగా నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ కీలకంగా మారింది. కోల్కతా పోర్ట్ నావిగేషన్ కోసమే తాము ఫరక్కా డ్యామ్ నిర్మించినట్లు భారత్ చెబుతోంది. ఈ డ్యామ్ వల్ల వేసవి కాలంలో నదీ ప్రవాహం తగ్గి నీరు ఉప్పుగా మారడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బంగ్లా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫరక్కా ప్రభావం తగ్గించడానికి పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణం బంగ్లాదేశ్ ఇటీవల ఆమోదం. 2033 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తీస్తా నది వివాదం కూడా ఉంది. మమతా బెనర్జీ తీస్తా నది విసయంలో సహకరించలేదని ఇటీవల బీఎన్పీ ఆరోపించింది. భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే ఆ పార్టీ చెప్పింది.

