క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్ను 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. సౌతాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ బోర్డు ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, జూలైలో ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నివేదికలు వస్తున్నాయి.
సౌతాఫ్రికాలోనే మెజారిటీ మ్యాచ్లు..
ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్లు జరగనుండగా, అందులో అత్యధికంగా 41 మ్యాచ్లకు సౌతాఫ్రికాలోని 8 వేదికలు అతిథ్యమివ్వనున్నాయి. జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్, విక్టోరియా ఫాల్స్ వంటి 3 వేదికల్లో 8 నుండి 10 మ్యాచ్లు జరుగుతున్నాయి. మిగిలిన 3 మ్యాచ్లను నమీబియా నిర్వహించనుంది. జింబాబ్వేలో కొత్తగా నిర్మాణం ‘ఫెల్ మోసి-ఓ-తున్యా’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది మే నెలలో అధికారికంగా ప్రారంభం. ఆఫ్రికా ఖండంలో 2003 తర్వాత జరుగుతున్న మొదటి పురుషుల ప్రపంచకప్ ఇదే కావడం విశేషం.
మారనున్న టోర్నీ ఫార్మాట్…
గత రెండు ప్రపంచకప్ ఎడిషన్లలో కేవలం 10 జట్లే పోటీపడగా, 2027 టోర్నీలో ఐసీసీ మళ్లీ పాత 14 జట్ల ఫార్మాట్ను తీసుకువస్తోంది. ఈ 14 జట్లను తలా ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యులైనందున సౌతాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించగా, నమీబియా మాత్రం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడి రావాల్సి ఉంటుంది. 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) కింద జరిగే మొదటి ఐసీసీ ఈవెంట్ ఇదే. రాబోయే రోజుల్లో వరల్డ్షిప్ టెస్ట్ ఛాంపియన్(WTC) విస్తరణ, ఫార్మాట్ మార్పులపై కూడా హాంకాంగ్లో జరిగే ఐసీ సమావేశాల్లో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

