ఏఐ ఏజెంట్లు అనుకున్నంత పని చేయడం లేదని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. కంపెనీ టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర పునర్వ్యవస్థీకరణ కంపెనీ ఆశించిన ఫలితాలను ఇవ్వండి. కంపెనీ ఏఐ ఏజెంట్లు ఊహించినంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. దీనికి సంబంధించి మార్పుల సమయం గురించి సరిగా అంచనా వేయలేదని అన్నారు. మెటా పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించారు.
ఇది మెటా లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతం. 2026 నాటికి 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసిన మెటా భారీ ఏఐఐ మౌలిక వనరులకు నిధులు సమకూర్చడమే ఈ చర్యలని సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా ఏజెంటిక్ అభివృద్ధి గమనం తాము ఊహించిన విధంగా నిజంగా వేగవంతం కాలేదని జుకర్బర్గ్ అంగీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంథ్రోపిక్ వారి క్లాడ్ కోడ్ వంటి సాధనాలపై అధికారులు ఆశాజనకంగా, ఏఐఐ ఏజెంట్లపై కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇంకా సరైన ఫలితాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఇదే విషయమై మెటా సీటీవో ఆండ్రూ బోస్వర్త్ కూడా స్పందించారు. తమ కొత్త అప్లైడ్ ఏఐ విభాగాన్ని ప్రారంభించడంలో కంపెనీ అత్యంత ఘోరమైన విఫలమైందని ఒప్పుకున్నారు. ఈ మార్చి ఏడాదిలో 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లతో ఈ యూనిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెటా జెనరేటివ్ ఏఐఐ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే సరైన ఇవ్వలేదని అన్నారు. తన దర్శనికతను సంస్థ ద్వారా స్పష్టంగా వివరించడంలో విఫలమవడం విశ్వాసాన్ని దెబ్బతీసిందని బోస్వర్త్ అన్నారు.
మెరుగైన కమ్యూనికేషన్, కెరీర్ అవకాశాలు, ఆఫీస్ సౌకర్యాలను కూడా అందించడం ద్వారా మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. తాజాగా మెటా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మేనేజర్లు తమ కింద పనిచేసే వారి సంఖ్యను 20కి పరిమితం చేసింది. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడానికి మెటా సంస్థ మైక్రోకిచెన్లు, ప్రయాణ బడ్జెట్లు, సామాజిక కార్యక్రమాలలో పెట్టుబడి పెడుతుందని సీటీఓ వివరించింది. మెటా సంస్థ తన కొనసాగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా మే నెలలో తన ఉద్యోగులలో సుమారు 10 శాతాన్ని, అంటే దాదాపు 8,000 మందిని తొలగించింది.

