NHAI టోల్ మినహాయింపు జాబితాను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రస్తుతం కొన్ని రకాల వాహనాలకు టోల్ ఫీజ్ నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే ఈ ఫ్రీ టోల్ ప్రయాణాల లిస్టును భారీగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపులు వర్తించకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎగ్జెంప్షన్ సిస్టమ్ ను రివ్యూ చేసిన ఒక హై-లెవెల్ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్ ఆధారంగా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోనుంది. టోల్ ఫీజ్ రూల్స్ ను సవరించి ఈ మినహాయింపుల కేటగిరీని ఎలిమినేట్ చేయడానికి రోడ్డు రవాణా, ప్రముఖ మంత్రిత్వ శాఖకు కమిటీ సూచించింది. ఒకేసారి పెద్ద మార్పులు చేయకుండా ఫేజ్ ల వారీగా ఈ మినహాయింపులను తగ్గించనున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా వెళ్లే వాహనాల సంఖ్య బాగా తగ్గుతుంది.
ఇంకా చదవండి: బజాజ్ రాబోయే డ్యూయల్ స్పోర్ట్ మోటార్సైకిల్: బజాజ్ నుంచి సరికొత్త డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు
వీఐపీ కల్చర్ కు చెక్ పెట్టడమే టార్గెట్
ఈ కొత్త ప్రపోజల్ అమల్లోకి వస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉపయోగించే వాహనాలే ఫస్ట్ ఈ ఫ్రీ టోల్ లిస్టు నుంచి బయటకు వెళ్తుంది. సాధారణ ప్రజలకు ఇబ్బందిగా మారినఐపీ కల్చర్ కు చెక్ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా అడుగులు వేస్తూ టోల్ మినహాయింపులు కోరడానికి బదులుగా వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag వార్షిక పాస్) ఉపయోగించేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ యాన్యువల్ పాస్ అనేది ఒక ప్రీపెయిడ్ ప్లాన్. ఇది ఒక ఏడాది పాటు లేదా దేశవ్యాప్తంగా 200 టోల్ క్రాసింగ్ ల వరకు చెల్లుబాటు అవుతుంది. రీసెంట్ గానే ఈ పాస్ ధరను రూ. 3,000 నుంచి రూ. 3,075 కి పెంచారు.
Read Also: తక్కువ ధరలో SUV ఈవీని లాంచ్ చేయనున్న VinFast, ఈ కార్లకు గట్టి పోటీ తప్పదా ?
ప్రస్తుతం ఫ్రీగా వెళ్తున్న వాహనాలు..
ఇండియాలో ప్రస్తుతం 25 రకాల ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులకు, వారి వెంట వెళ్లే సెక్యూరిటీ వాహనాలకు నేషనల్ హైవేస్ పై టోల్ కట్టాల్సిన అవసరం లేదు. వీరితో పాటు డిఫెన్స్ సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, పారామిలట్రీ గ్రూపులు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు, ఫైర్ డిపార్ట్మెంట్, హైవే ఇన్స్పెక్షన్ టీమ్స్ కు చెందిన అఫీషియల్ వాహనాలకు మినహాయింపు ఉంది. అంబులెన్స్లు, శ్మశాన వాటిక వాహనాలకు కూడా ప్రస్తుతం టోల్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తోంది. అయితే కొత్త రూల్స్ వస్తే మాత్రం కేవలం ఎమర్జెన్సీ, రక్షణ వాహనాలకు మాత్రమే మినహాయింపులు ఉంచి మిగిలిన ప్రభుత్వ అధికారుల ఫ్రీ రైడ్స్ కు ఎండ్ కార్డ్ వేసే ఛాన్స్ ఉంది.
ఇంకా చదవండి

