ఐపీఎల్ 2026 మ్యాచ్లో గుజరాత్ టైటా ఫైనల్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయవంతంగా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మొదటి నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
మరోవైపు వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 4 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి కగిసో రబడ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 15 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ కాగా, కృనాల్ పాండ్య కూడా రషీద్ ఖాన్ బౌలింగ్లోనే 2 బంతుల్లో 1 పరుగు చేసి వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం పట్టుదలతో ఆడి కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ.. ఆర్సీబీకి రెండో సారి కప్పు అందించాడు. 156 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
కోహ్లీ విశ్వరూపం..
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం “పరుగుల ఆకలి”. ఎన్ని రికార్డులు సృష్టించినా, ఎన్ని బద్దలు కొట్టినా.. ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక రికార్డు సాధించాలంటే ఒక కుర్రాడి లాంటి కసి, ఎనర్జీ కోహ్లీలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఐపీఎల్లో ఇప్పటికే 65కు పైగా హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేయడానికి ఐపీఎల్ 2026 ఫైనల్ లాంటి పెద్ద వేదికను ఎంపిక చేసింది.
అంచనాలను తలకిందులు చేస్తూ మెరుపు ఆనందం..
ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ వేగంగా ఆడుతూ ఉంటే, అతనికి కోహ్లీ పాటలు ఇస్తూ సపోర్ట్ ఇస్తాడని అందరూ భావించారు. కానీ మైదానంలో సీన్ రివర్స్ అయింది. కోహ్లీ మొదటి నుంచే గుజరాత్ బౌలర్లు కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్లపై విరుచుకుపడుతూ కేవలం 12 బంతుల్లోనే 35 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ మైదానంలో కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించాడు.. కోహ్లీ పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టి, అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వదిలేశాడు.
గాయాన్ని సైతం లెక్కచేయకుండా..
మ్యాచ్లో 10 ఓవర్ల సమయానికి కోహ్లీ క్రాంప్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్నా కూడా అతను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మధ్యమధ్యలో వాటర్ బ్రేక్స్ తీసుకుంటూ ఆటను కొనసాగించాడు. ఫిఫ్టీ పూర్తి చేసిన వెంటనే ఏమాత్రం సంబరాలు చేసుకోకుండా, ఇంకా పరుగుల వేట కొనసాగించాలంటే కసితో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ నీళ్లు పంపించమని సైగ చేశాడు. చిన్న విషయాలుగా అనిపించినా.. కట్టుబాటు, పోరాట పటిమ, అత్యుత్తమ మైండ్ సెట్ అంటే ఏంటో చూపించడానికి విరాట్ కోహ్లీ ఒక గొప్ప ఉదాహరణ. రాబోయే యువ క్రికెటర్లకు అతని ఆట ఒక అద్భుతమైన పాఠం.

