న్యూస్ డెస్క్:దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు (గుజరాత్ హైకోర్టు )కీలక తీర్పు వెలువరించింది.ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను,మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది.
ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది2008,జులై 26న అహ్మదాబాద్లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
ఆ తర్వాత సూరత్లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా,2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.

