కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొడగు నిర్వహించే దుబారే ఏనుగుల శిబిరంలో జరిగింది. ఏనుగులను స్నానం చేయడానికి మావటీలు కొలనులోకి వదిలారు. ఈ సమయంలో నీటిలో ఉన్న రెండు ఏనుగులు అనుకోకుండా ఒకదానికొకటి గొడవ పడ్డాయి. ఒక ఏనుగుపై దాడి చేయడంతో మరో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల మధ్య జరిగిన ఈ గొడవలో ఓ ఏనుగు అదుపుతప్పి సమీపంలో ఉన్న పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. ఈపై చెన్నైకి చెందిన మహిళ పర్యాటకుల పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త, పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.

