నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద పనిచేస్తున్న 16,871 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుంది. క్రమబద్ధీకరించిన సాధారణ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా ముగిసే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇందులో 9,009 ఔట్ సోర్సింగ్, 4,801 కాంట్రాక్ట్, 3,056 అనరియమ్ సేవలతో పాటు ఎంటీఎస్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మందికి ఊరట లభించింది.
పోస్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు మొదట కనిపించింది నవతెలంగాణ.

