తెలంగాణ:యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి ( జక్కిడి శివచరణ్ రెడ్డి )జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
రెండు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ అందించింది.వివరణ ఇవ్వకపతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎల్బీనగర్ లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు.ప్లెక్సీలో తన తండ్రి ప్రభాకర్ రెడ్డి (ప్రభాకర్ రెడ్డి)ఫోటో వేయలేదంటూ ఈశ్వరమ్మ యాదవ్ మనవుడు సురేష్ యాదవ్కు ఫోన్ చేసిన శివచరణ్ రెడ్డి బూతులు తిట్టనట్టు ఆడియో వైరల్ అవుతోంది.
దీంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.బీసీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ సంఘాలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు( పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ) ఫిర్యాదు చేశాయి.
శివచరణ్ రెడ్డి చరణ్ పదవి నుండి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు శివారెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రూ.7 కోట్లు ఖర్చు చేశామని మరో ఆడియో వైరల్ అవుతోంది.ఇరువురిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

